ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరుతో పాటుగా తుళ్లూరు మండలంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, పోలవరం, పసుపుగల్లు, శంకరాపురం, మారెళ్ల, తూర్పుకంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, తాళ్లూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ భూప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరుతో పాటుగా తుళ్లూరు మండలంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి. ముండ్లమూరు, పోలవరం, పసుపుగల్లు, శంకరాపురం, మారెళ్ల, తూర్పుకంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, తాళ్లూరుతో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. ఈ భూప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Like
3
0 Σχόλια 0 Μοιράστηκε 513 Views 0 Προεπισκόπηση